వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సతీసమేతంగా భారత్‌ కు వస్తాః ముషారఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత ప్రధాని వాజ్‌పేయి నుంచి చర్చల కోసం అందిన తీర్మానాన్ని పాకిస్తాన్‌సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ ఆమోదించారు.జూన్‌ 20 తర్వాత ఏ రోజైనా వాజ్‌ పేయితో భేటీకి తాను సిద్ధమేనంటూ మంగళవారం రాత్రి ఆయన పంపిన లేఖ ఢిల్లీ చేరింది.అరమరికలు లేకుండా, హృదయపూర్వకమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు ముషారఫ్‌ తన లేఖలోపేర్కొన్నారు.

భారత్‌-పాక్‌ లు చర్చలకు సిద్ధ పడితే కాశ్మీర్‌ సమస్య పరిష్కారం అంత కష్టం కాదని, కాశ్మీరీల అభిమతానికి అనుగుణంగా చర్చలు జరగాలని ముషారఫ్‌ సూచించారు. వాజ్‌పేయి రాజనీతిజ్ఞతను ముషారఫ్‌ తన లేఖలో వేనోళ్ళ కొనియాడారు. అయితే కాశ్మీర్‌ లో దాడులు ఆపాల్సిందిగా తీవ్రవాదులకువిజ్ఞప్తి చేసేందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదంటూ ముషారఫ్‌ తన సహజ నైజాన్ని చాటుకున్నారు.

ముషారఫ్‌ పంపిన లేఖను ఢిల్లీలోని పాక్‌ రాయబారి జహంగీర్‌ఖాన్‌ మంగళవారం సాయంత్రం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి చోకిలా అయ్యర్‌ కుఅంద జేశారు. వాజ్‌ పేయి తన లేఖలో కాశ్మీర్‌ ఊసెత్తనప్పటికీ ముషారఫ్‌ లేఖఅంతా కాశ్మీర్‌ పైనే సాగింది. కాశ్మీర్‌ లో ప్రజాభిప్రాయసేకరణ జరపాలని నేరుగా ప్రస్తావించనప్పటికీ కాశ్మీరీల అభిమతానికి అనుగుణంగా సమస్య పరిష్కారం కావాలంటూ ముషారఫ్‌ లౌక్యం ప్రదర్శించారు.

సతీ సమేతంగా భారత్‌ వస్తున్నట్లు ముషారఫ్‌ తన లేఖలోపేర్కొన్నారు. జూన్‌ 20, 25, జూన్‌ చివరలో, జూలై మొదటి వారంలో ఎప్పుడైనా చర్చల కోసం భారత్‌ వచ్చేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X