జులైలో భారత్-పాక్ చర్చలు
న్యూఢిల్లీ:పాకిస్తాన్ సైనిక పాలకుడు ముషారఫ్, భారత ప్రధాని వాజ్పేయి మధ్య శిఖరాగ్ర చర్చలు జులై మొదటి వారంలో జరిగే అవకాశం వుంది.ప్రధాని మోకాలి శస్త్ర చికిత్స జరిగిన తర్వాతనే శిఖరాగ్ర సభ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్ మహాజన్ చెప్పారు. జూన్ 7న ప్రధాని మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ముంబాయిలోని బ్రిచ్కాండి ఆస్పత్రిలో జరుగుతుంది. ఆపరేషన్ తర్వాత ప్రధాని కనీసం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవల్సివుంటుంది. అందువల్ల శిఖరాగ్ర చర్చలకు తేదీలను జులైలోనే ఖరారు చేస్తారని ఆయన తెలిపారు.
గురువారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో పాక్నేత ముషారఫ్ను చర్చలకు ఆహ్వానించాలన్న తన నిర్ణయాన్ని గురించి పాక్ అధినేత ప్రతిస్పందన గురించి ప్రధాని తమ మంత్రివర్గ సహచరులకు వివరించారు. కులూమనాలీలో విశ్రాంతి తీసుకుని బుధవారం నాడే ఆయన ఢిల్లీ తిరిగి వచ్చారు. గత 23న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చర్చలకు పాకిస్తాన్ను ఆహ్వానించాలని నిర్ణయించిన నాటి నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలను కేబినెట్ సమావేశంలో ప్రధాని ప్రస్తావించారని మహాజన్ వెల్లడించారు.
ప్రధాని
జూన్
6న
ముంబాయి
బయలుదేరి
వెళ్లుతున్నారని,
ఆపరేషన్
తర్వాత
ఫిజియోథెరపి
కోసం
కనీసం
పదిరోజుల
పాటు
ఆయన
ముంబాయిలోనే
వుంటారని
మహాజన్
వివరించారు.
ఉపఖండంలో
శాంతి,
సుస్థిరతల
విషయంలో
ప్రధాని
కచ్చితమైన
అవగాహనతో
వున్నారని
మహాజన్
చెప్పారు.