ఇదే మొదటి సారికాదు: ప్రధాని
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైనిక పాలకుడుపర్వేజ్ ముషర్రాఫ్ను తాను చర్చలకు ఆహ్వానించడాన్ని ప్రధానిఅటల్ బిహారీ వాజ్పేయి సమర్థించుకున్నారు.పాకిస్థాన్ సైనిక పాలకులతో చర్చలు జరపడం ఇదేమొదటిసారి కాదని ఆయన అన్నారు. ఇంతకు ముందు భారత ప్రభుత్వంపాకిస్థాన్ మిలటరీ పాలకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లుఆయన గురువారం జరిగిన మంత్రి వర్గసమావేశంలో తన మంత్రి వర్గ సహచరులతోచెప్పారు. మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్ననిర్ణయాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిప్రమోద్ మహాజన్ విలేకరులకు వివరించారు.
హోంమంత్రి ఎల్.కె. అద్వానీ, రక్షణ శాఖ మంత్రిజస్వంత్ సింగ్ రాష్ట్ర యంత్రాంగంతో జరిపిన చర్చల ఆధారంగా, వివిధ ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా జమ్మూకాశ్మీర్లో కాల్పుల విరమణను పొడిగించకూడదని ప్రబుత్వంనిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కాశ్మీర్ సమస్యపైనే కాకుండాద్వైపాక్షిక అంశాలన్నింటి మీద చర్చలకు ఆసక్తిచూపినందుననే ముషర్రాఫ్ను ఆహ్వానిస్తున్నట్లు ప్రధానిసమావేశంలో అన్నారు.