వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మభూమిలో ఫిర్యాదుల పరంపర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః 15వ విడత మహిళా జన్మభూమి కార్యక్రమం రెండో రోజైన శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. వరంగలు, కడప జిల్లాలో కొన్ని అపశృతులు ఎదురైనప్పటికీ అన్ని జిల్లాలు, మండలాలలో జన్మభూమి కార్యక్రమంపెద్ద ఎత్తున నిర్వహించారు. మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు పంపిణీ చేశారు. మాతాశిశు సంరక్షణవిషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులు ప్రజలకువివరించారు. పెద్ద ఎత్తున ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేశారు.పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నారు.

వరంగల్‌ లో........
వరంగల్‌ జిల్లా హన్మకొండ మండలం తిమ్మాపూర్‌ లో ప్రజలు అధికారులను నిలదీశారు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఎంతో ప్రభుత్వంతో మొరపెట్టుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని మహిళలు అధికారులను నిలదీశారు. స్థానిక ఎమ్మెల్ల్యే ధర్మారావు జోక్యం చేసుకొని సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.

కడపలో........
కడపలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిసరస్వతి శనివారం కడపలో జన్మభూమి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గత 14 జన్మభూమి కార్యక్రమాలలో ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదంటూ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. వివిధ సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు సమర్పించేందుకు మహిళలు, ముఖ్యంగా వామపక్ష కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. దీనితో కడపలో ఉద్రిక్త వాతావరం నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X