వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండూః నేపాల్‌ రాజకుటుంబం యావత్తుతుడిచిపెట్టుకు పోవడానకి ఓ యువతి కారణంఅంటున్నారు నేపాల్‌ రాజకుటుంబంతో సన్నిహిత సంబంధాలు గల వారు. నేపాల్‌ రాజు బీరేంద్ర కుమారుడు దీపేంద్ర ఆ కుటుంబానికి బద్ధ శత్రువులైన రాణా కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు.

అయితే ఆ ప్రేమను రాణి ఐశ్వర్య అంగీకరించలేదు. దీపేంద్ర ప్రేమించింది ఎవరినో కాదుగ్వాలియర్‌ లోని సింధియాల కుటుంబానికి చెందిన దేవయాని రాణా అనే అమ్మాయిని. ఆమె హార్వార్డ్‌ లో చదువుకుంది.చాలాకాలంగా పరిచయం వున్న దేవయాని రాణానుపెళ్ళి చేసుకుంటానంటూ దీపేంద్ర పట్టుపట్టాడు. అయితేఅందుకు రాజకుటుంబం యావత్తు, ముఖ్యంగా తల్లిఐశ్వర్య అభ్యంతరం చెప్పింది. దేవయాని రాణా ప్రమఖ కాంగ్రెస్‌ నాయకుడు మాధవరావు సింధియా మేనకోడలని భావిస్తున్నారు.

ఇక్కడ మరో కధ కూడా ప్రచారంలో వుంది. దీపేంద్ర తన 35వ ఏట వరకుపెళ్ళి చేసుకోరాదని, అలా చేసుకుంటే వీరేంద్రకు ప్రాణ గండం వుందని జ్యోతిష పండితులు హెచ్చరించారట. దీనితో దీపేంద్రకు 35 ఏళ్ళు నిండే వరకు ఎవరినీ పెళ్లాడరాదని ఆంక్షలుపెట్టారు. కొద్ది నెలలుగా రాజకుటుంబంలో ఈ చిచ్చు రాజుకుంటునే వున్నదని, శుక్రవారం అది పతాక స్థాయికి చేరిందని రాజకుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. మొత్తానికి ప్రేమ వ్యవహారం రాజకుటుంబాన్ని బలిగొనడం అత్యంతవిషాదకరం.

  • భారత్‌దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
  • తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్‌ రాజు
  • వైద్యపరంగా మరణించిన దీపేంద్ర!
  • ెనపాల్‌ ఆఖరు సామ్రాట్టు
  • నేపాల్‌ రాజ దంపతుల హత్య
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X