వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగానంపై ఢిల్లీదే భారంః ఎమ్మెస్సార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళంః ప్రత్యేక తెలంగాణా ఉద్యమంపేరుతో కాంగ్రెస్‌ పార్టీలో గందరగోళం సృష్టిస్తున్న నాయకులపై హైకమాండ్‌ సత్వరం చర్య తీసుకోవాలని పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం ఆయనశ్రీకాకుళంలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ధోరణిని అరికట్టకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని పార్టీ అధిష్ఠాన వర్గానికి స్పష్టం చేశామని, త్వరలో హైకమాండ్‌ చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

కనీసం స్థానికి నేతలకు చెప్పకుండా కొందరు తెలంగాణా ఎమ్మెల్ల్యేలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వినతిపత్రం సమర్పించడంవిచారకరమని ఎమ్మెస్సార్‌ అన్నారు. ఈ ధోరణికి అడ్డుకట్టవేయకపోతే పరిస్థితి చేయదాటిపోతుందని అధిష్ఠాన వర్గానికి తేల్చి చెప్పినట్లు ఎమ్మెస్సార్‌వివరించారు. అధిష్ఠానం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణాకు ఫుల్‌ స్టాప్‌ పెట్టకపోతే కళింగ ఆంధ్ర, కోస్తా ఆంధ్ర ఉద్యమాలు కూడా పుట్టుకొస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

చిన్నరాష్ట్రాలంటూ రాష్ట్రాలలో చిచ్చుపెట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయనవిమర్శించారు. ఇప్పుడు ఆ సెగలు బిజెపి పార్టీకి కూడా తగులుతున్నాయని ఆయన అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్ల్యే డి. పాపారావుపై త్వరలో క్రమశిక్షణ చర్య తీసుకోనున్నట్లు ఆయనవివరించారు. పార్టీ నుంచి బహిష్కరణను పొందాలనే పాపారావు కోరుకుంటున్నారని, అలా అయితే ఆయన ఎమ్మెల్ల్యే పదవి భద్రంగా వుంటుందని ఎమ్మెస్సార్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X