వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా అభివృద్ధి మాకే సాధ్యంః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: జూన్‌ నెలాఖరులోపు గోదావరి ఎత్తిపోతల పధకానికి ఎట్టిపరిస్ధితుల్లో శంఖుస్ధాపన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆదివారం నాడు కరీంనగర్‌ జిల్లా పోతిరెడ్డిపేటలో జన్మభూమి కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే గోదావరి ఎత్తిపోతల పధకాన్ని వీలయినంత త్వరగా పూర్తిచేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో వున్నదని ఆయన అన్నారు.

తెలంగాణా ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరచేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నదని, తమ ప్రభుత్వం మాత్రమే తెలంగాణాను అభివృద్ధి పరచగలదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణా ప్రాంతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని చంద్రబాబు అన్నారు. ఇంకా అభివృద్ధి పరచేందుకు తాము సిద్ధంగా వున్నామని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X