వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ లో35

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఫలితాలను ఇంటర్మీడియట్‌ బోర్డు ఆదివారం విడుదల చేసింది. పరీక్షలు జరిగిన నెలరోజల్లో ఫలితాలు ప్రకటిస్తామంటూ ఆర్భటంగా ప్రకటనలు చేసిన ఇంటర్‌ బోర్డు చివరకు నానా తంటాలు పడి మొదటి సంవత్సరం ఫలితాలను మాత్రం విడుదల చేసింది. మొదటి సంవత్సరంలో 35 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలను ఈ నెల 7న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. పైచదువుల కోసం ప్రయత్నాలు చేసే వారికి ఎంతో అవసరమైన రెండో సంవత్సరం ఫలితాలు విడుదల చేయకుండా ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఇంటర్‌ బోర్డు అధికారులు చెబుతున్నట్లు ఈ నెల 7న అయినా రెండో సంవత్సరం ఫలితాలు ప్రకటిస్తారా? మరింత జాప్యం చేస్తారా అనే విషయం వేచి చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X