ప్రమాదవశాత్తు రాజకుటుంబం మృతి!
ఖాట్మండూః కేవలం ప్రమాదవశాత్తూ రాజకుటుంబంతో సహా 11మంది మరణించినట్లు తాత్కాలిక రాజు, మరణించిన బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర ఆదివారం సంచలనాత్మక ప్రకటన చేశారు. రాజ కుటుంబం భోజనాలు చేస్తున్న సమయంలో అక్కడ వున్న ఆటోమాటిక్ గన్పేలి బీరేంద్రతో సహా 11 మంది మరణించారని జ్ఞానేంద్ర ప్రకటించారు. ఇదేవిషయాన్ని నేపాల్ ప్రధాని కొయిరాలా కూడా ఒక ప్రకటనలో వెల్లడించారు.
బీరేంద్ర కుమారుడు దీపేంద్ర మెషిన్ గన్ తో కుటుంబ సభ్యులపై కాల్పులు జరపడంతో 11 మంది మరణించారంటూ రాజకుటుంబ ప్రతినిధి శనివారం ప్రకటించినవిషయం విదితమే. ఆ ప్రకటనకు విరుద్ధంగా ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందంటూ తాత్కాలక రాజు, ప్రధాని వేరువేరు ప్రకటనలలో వెల్లడించడంతో నేపాల్ తో పాటు యావత్ ప్రపంచం మరింత అయోమయంలో పడింది.
నేపాల్
లో
సాధారణ
స్థితిః
రాజకుటుంబం
తుపాకి
తూటాలకు
బలి
కావడం,
హడావుడిగా
శనివారం
నాడే
పశుపతినాథ్
ఆలయం
సమీపంలో
అంత్యక్రియలు
నిర్వహించడం
వంటి
పరిణామాలతో
నేపాల్
ప్రజలువిషాదంతో
నిండిన
ఆశ్చర్యానికి
లోనయ్యారు.
శనివారం
కొన్ని
ప్రాంతాలలో
ఉద్రిక్తతలు
కూడా
చోటు
చేసుకున్నాయి.
అయితే
ఆదివారం
నేపాల్
లో
ముఖ్యంగా
రాజధాని
నగరం
ఖాట్మండూలో
సాధారణ
పరిస్థితులు
నెలకొన్నాయి.
ప్రజా
జీవనం
ఎటువంటి
ఆటంకాలు
కలగలేదని,
ప్రజలు
వారివారి
విధులకు
హాజరవుతున్నారని
సమాచారంఅందింది.
- భారత్దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
- తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్ రాజు
- ెనపాల్ ఆఖరు సామ్రాట్టు
- రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
- నేపాల్ రాజ దంపతుల హత్య