నక్సల్స్ చేతిలోఎఎస్ఐ హత్య
ఒంగోలు: ప్రకాశం జిల్లా పుల్లలచెరువుమండలం మర్రివేముల గ్రామంలో జన్మభూమి కార్యక్రమంముగించుకుని తిరిగి వస్తున్న అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) కె..పి. ప్రశాంత్రావును ఆదివారంమధ్యాహ్నం పీపుల్స్వార్ నక్సలైట్లు తుపాకులతో కాల్చిచంపారు. ఆ తర్వాత ఆయన ప్రయాణిస్తున్న వైద్యశాఖకుచెందిన అంబులెన్స్ను దగ్ధం చేశారు. గుంటూరు జిల్లాబెల్లంకొండలో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగాపీపుల్స్వార్ నక్సలైట్లు ఎఎస్ఐని కాల్చిచంపారు.అత్యాధునిక ఆయుధాలతో పాటు వాటీటాకీలు కూడా కలిగివున్న పీపుల్స్వార్ గ్రూప్ సభ్యులు సుమారు 15మంది నక్సలైట్లు ఈ దురాగతానికి పాల్పడ్డారు. దీంతో ఆవెనుక వేరే వాహనాల్లో వస్తున్న జన్మభూమినోడల్ అధికారులంతా వెనుదిరిగి వెళ్లారు.
మొదట ఎఎస్ఐ ప్రయాణిస్తున్నఅంబులెన్స్ను అంతకు ముందే అక్కడికి చేరినసాయుధ దళ సభ్యులు నలుగురు దారికిఅడ్డంగా రాళ్లు పెట్టి నిలిపివేశారు. గాలిలోకి నాలుగు రౌండ్లు కాల్పులుజరిపారు. ఆ తర్వాత డ్రైవర్ స్థానంలో వున్న ప్రశాంత్రావును తమవద్దకు రప్పించుకుని అదే వాహనంలో వున్నవైద్య సిబ్బందిని వదిలివేశారు. ప్రశాంత్రావు తననువదిలివేయాలని విన్నవించుకున్నాపట్టించుకోకుండా నక్సల్స్ అతడ్ని కాల్చి చంపారు. మృతుడినుదుటిపైన, ఎడమచేయిపైన, ఛాతీపైన,మరో చోట గాయాలయ్యాయి. తర్వాత వారు అంబులెన్స్నుదగ్ధం చేశారు.
ఎఎస్ఐ ప్రశాంత్రావును నక్సల్స్ కాల్చి చంపడాన్ని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ఖండించారు. నిరాయుధుడైన ఓ పోలీసుఅధికారిని హత్య చేయడాన్ని పిరికిపందలచర్యగా ఆయన హైదరాబాద్లో అన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు సానుభూతితెలియజేశారు. వారికి పూర్తి సహాయం అందిస్తామనిఆయన హామీ ఇచ్చారు.