వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలం అంచనాకు ఆంధ్రబిజెపి పర్యటనలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలాన్ని అంచనా వేసేందుకు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్ల్యేలతో కూడిన ఎనిమిది బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాయని బిజెపి రాష్ట్ర శాఖ సోమవారం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వున్నా, లేకపోయినా బిజెపి బలం ఎంతో నిర్ధారించేందుకు ఈ ఎనిమిది బృందాలు ప్రయత్నిస్తాయని బిజెపి అధికార ప్రతినిధి జి. కిషన్‌ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఆదివారం జరిగిన కీలక పదాధికారుల సమావేశంలో పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై ఒక నిర్ణయం తీసుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేశంతో బిజెపి పొత్తుపెట్టుకున్న విషయం విదితమే. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా బలాన్ని నిరూపించుకోవాలని బిజెపి రాష్ట్ర శాఖ తహతహలాడుతున్నది. ఇందుకు బిజెపి అధిష్ఠానం ఏమంటుందో వేచి చూడాలి.
ఇత ప్రత్యేక తెలంగాణా విషయంలో నిర్ణయాన్ని బిజెపి రాష్ట్ర శాఖ పార్టీ అధిష్ఠానానికి వదిలేసింది. బిజెపి నేతలెవరూ

తెలంగాణా ఉద్యమంలో చేరడం లేదని కూడా కిషన్‌ రెడ్డి సోమవారం స్పష్టం చేశారు. తెలంగాణా ఉద్యమం పట్ల సానుభూతి ప్రదర్శించి వుండవచ్చునని మాత్రం ఆయన అంగీకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X