వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్జించిన తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌ నగర్‌ః తెలంగాణా కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్ల్యేలు,సీనియర్‌ నేతలు సోమవారం ప్రత్యేక తెలంగాణా కోసం నినదించారు. ప్రత్యేక తెలంగాణా కోసం సోమవారం మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పాలమూరు ప్రజాగర్జనపేరిట భారీ సభను తెలంగాణా కాంగ్రెస్‌ ఎమ్మెల్ల్యేలు నిర్వహించారు. తెలంగాణా కు చెందిన ఎమ్మెల్ల్యేలతో పాటు పలువురుసీనియర్‌ పార్టీ నేతలు ఈ ప్రజాగర్జనలో పాల్గొన్నారు. ఈ ప్రజాగర్జనకు వేలాది మంది ప్రజలు తరలిరావడంవిశేషం.

తెలంగాణా రాష్ట్ర సమితి ప్రత్యేక తెలంగాణాను సాధించలేదని, చంద్రశేఖర రావును ప్రజలు నమ్మరని ఈ సభలో పాల్గొన్న పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తడి తీసుకువస్తామని వారు నినదించారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటయ్యే వరకువిశ్రమించేది లేదంటూ వారు శపథం చేశారు.

కాంగ్రెస్‌ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఈ సదస్సుకుపెద్ద సంఖ్యలో ప్రజలను తరలించారు. ప్రజాగర్జన తో మహబూబ్‌ నగర్‌ లో కోలాహల వాతావరణం నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X