నేపాల్ రాజుగా పట్టాభిషిక్తుడైన జ్ఞానేంద్ర
ఖాట్మండూః నేపాల్ రాజుగా జ్ఞానేంద్ర సోమవారం ఉదయం పట్టాభిషిక్తులయ్యారు. బీరేంద్ర కుమారుడు, రాజకుటుంబం మృతికి బాధ్యడుగా భావిస్తున్న దీపేంద్ర ఖాట్మండూలోని మిలటరీ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి నుంచి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే జ్ఞానేంద్రను రాజుగా ప్రకటించింది. ఆ తరువాత కొద్దిసేపటికే జ్ఞానేంద్ర పట్టాభిషేకం రాజ లాంఛనాల మధ్య జరిగింది.
కట్టుదిట్టమైన మిలటరీ భద్రత మధ్య జ్ఞానేంద్ర పట్టాభిషేకం జరిగింది. జ్ఞానేంద్ర పట్టాభిషిక్తుడు కావడంతో ఆయన కుమారుడు, నేరచరిత కలిగిన పరస్ షా యువరాజు అవుతాడు. ఈ పరిణామాలను నేపాల్ ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. జ్ఞానేంద్ర పట్టాభిషేకం జరుగుతుండగా రాజప్రాసాదం వెలుపల వందలాది మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. జ్ఞానేంద్రకు, ఆయనకుమారుడికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.
జ్ఞానేంద్ర
స్వర్ణమయ
సర్పసింహాసనాన్ని
అధిష్ఠించి,
రాజమకుటాన్ని
ధరించారు.
ఆ
తరువాత
ఆయన
గౌరవ
వందనాన్ని
స్వీకరించారు.
పర్యావరణ
వేత్తగా
పేరుపొందిన
జ్ఞానేంద్రకు
ఖాట్మండూలో
ఒక
పెద్ద
హోటల్,
టీ
ఎస్టేట్
లు,
వ్యాపారాలు
వున్నాయి.
వామపక్ష
ధోరణి
వున్న
జ్ఞానేంద్ర
నేపాల్
రాజు
కావడంతో
భారత్
-
నేపాల్
సంబంధాలు
భవిష్యత్తులో
ఎలా
వుంటాయో
వేచి
చూడాలి.
- ప్రమాదవశాత్తు రాజకుటుంబం మృతి!
- భారత్దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
- తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్ రాజు
- ెనపాల్ ఆఖరు సామ్రాట్టు
- రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
- నేపాల్ రాజ దంపతుల హత్య