వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితకు సుప్రీం నోటీసులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు సోమవారం నాడు విస్తృత బెంచ్‌ కు నివేదించింది. ఈకేసుపై పిటిషనర్ల వాదన సమర్థనీయంగా వున్నదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జయలలితకు, కేంద్ర ప్రభుత్వానికి, అటార్నీ జనరల్‌ సోలిసొరాబ్జీకి నోటీసులు జారీ చేసింది. కపూర్‌ తో పాటు మరో న్యాయవాది జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. జయలలితఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హురాలంటూ ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేయగా, ఆమె పార్టీ గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం, చివరకు జయలలితే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినవిషయం విదితమే.

జయలలిత ముఖ్యమంత్రి పదవిని చేపట్టడాన్ని ఇప్పటికే మద్రాస్‌ హైకోర్టులో కొందరు సవాలు చేశారు. సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదలులు దాఖలు చేసిన పిటిషన్లు పరిశీలించిన సుప్రీంకోర్టు తొలుత పిటిషనర్లకు అసలు ప్రాతిపదిక లేదంటూ తొలుత వాదించింది. ఆ తరువాత జస్టిస్‌ ఖాద్రి, జస్టిస్‌ దొరస్వామి ఈ కేసుకు గల రాజకీయ, రాజ్యాంగ ప్రాధాన్యత దృష్టా ముగ్గురు సభ్యులుగల సుప్రీంకోర్టు విస్తృత బెంచ్‌ కు నివేదిస్తున్నట్లు ప్రకటించింది.

వాజ్‌ పేయిని కలవనున్న జయః
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అనంతరం మొట్టమొదటి సారిగా సోమవారం రాత్రి జయలలిత ప్రధాని వాజ్‌ పేయిని కలుసుకోనున్నారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు కావడం, వాటిని సుప్రీంకోర్టు విస్తృత బెంచ్‌ కి నివేదించిన అంశాలు కూడా జయ ప్రధానితో చర్చించే అవకాశాలున్నాయి. జయ తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీని కూడా కలుసుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X