ప్రాంతీయవాదానికి కాంగ్రెస్ ఊతంః బాబు
కర్నూలుః సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేతకాక ఇప్పుడు ప్రాంతాయ వాదాన్ని రెచ్చగొడుతున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక రాయలసీమ, కళింగాంధ్రఅంటూ ప్రజలను రెచ్చగొట్టి పబ్బంగడుపుకోవాలని చూస్తున్నదని ఆయన ఆరోపించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన కర్నూలు జిల్లా కొత్తకోటలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు.
కర్నూలు జిల్లాలో ప్రజల సమక్షంలో సర్పంచ్, విద్యా వాలంటీర్లతో చంద్రబాబు మాట్లాడారు. చిన్నపిల్లల చేత పనిచేయించుకొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పాఠశాలకు వెళ్ళని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను చంద్రబాబు మందలించారు. చంద్రబాబు ప్రశ్నలు.... గ్రామస్తుల సమాధానాలతో గ్రామసభ ఎంతో ఉల్లాసంగా సాగింది. చంద్రబాబు పర్యటనను భగ్నం చేసేందుకు సిపిఎం కార్యకర్తలు విఫలయత్నం చేశారు. చంద్రబాబు నిర్వహిస్తున్న గ్రామసభ సమీపంలోకి దుసుకువచ్చేందుకు వామపక్ష కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి
జిల్లాలో
జరిగిన
గ్రామసభలో
చంద్రబాబు
టెన్త్,
సెవన్త్
లో
మంచి
మార్కులు
సాధించిన
విద్యార్థులను
సన్మానించారు.
ఎవరు
ఎన్ని
అడ్డంకులు
కల్పించినా
జన్మభూమి
ఆగదని
ఆయన
స్పష్టం
చేశారు.