వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండోరౌండ్ లో పుల్లెల గోపీచంద్
స్పెయిన్ః ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ ఛాంపియన్, ఆంధ్రతేజం పుల్లెల గోపీచంద్ 12వ ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలలో రెండోరౌండ్ లోకి దూసుకెళ్ళాడు. వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ లో ఆరో స్థానంలో వున్న గోపీచంద్ జర్మనీకి చెందినజీన్ రోచ్ పై 15-3,15-8 స్కోర్ తో సునాయాసంగా విజయం సాధించాడు. మూడో రౌండ్ లో ఇండొనేసియాకు చెందిన జోహన్ తో గోపీచంద్ తలపడనున్నాడు.
గోపీచంద్ విజయపరంపర ఇలా కొనసాగుతుండగా భారత్ కు చెందిన మరో ఆటగాడు శ్యాం గుప్తా మలేసియా అటగాడి చేతిలో మంగళవారం పరాజయంపాలై టోర్నమెంట్ నుంచి వైదొలగాడు.
Story first published: Tuesday, June 5, 2001, 23:53 [IST]