ఖాట్మండు ప్రశాంతం- సడలని ఉద్రిక్తత
ఖాట్మండు: రాజకుటుంబ సభ్యుల మృతితో అట్టుడికిన నేపాల్ రాజధాని ఖాట్మండులో మంగళవారం పరిస్థితి ప్రశాంతంగా వుంది. అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదు. అయితే, ఉద్రిక్తత తొలగిపోలేదు. సోమవారం అల్లర్లు చెలరేగడంతో కర్ఫ్యూ విధించారు. ఆ కర్ఫ్యూను మంగళవారం మధ్యాహ్నం వరకు సడలించారు. రాజకుటుంబం హత్యపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాట మారుస్తుండడంతో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. రాజకుటుంబం హత్యకు మరణించిన యువరాజు దీపేంద్ర కారణమనే వాదనను నేపాల్ ప్రజలు విశ్వసించడం లేదు. సోమవారం నేపాల్ కొత్త రాజుగా పట్టాభిషిక్తుడైన జ్ఞానేంద్రను అంగీకరించే స్థితిలో ప్రజలు లేరు. రాజకుటుంబాన్ని హత్య చేసిన వారిని పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాస్వామ్యంపై
ఏ
మాత్రం
విశ్వాసం
లేని
కొత్త
రాజు
జ్ఞానేంద్ర
దేశంలో
పలు
మార్పులకు
శ్రీకారం
చుట్టవచ్చునని
భావిస్తున్నారు.
అయితే,
జ్ఞానేంద్ర
కొత్త
రాజుగా
పట్టాభిషిక్తుడైనందున
భారత,
నేపాల్
సంబంధాల్లో
మార్పులు
సంభవించే
అవకాశాలు
లేవని
నిపుణులు
భావిస్తున్నారు.
రాజుకు
ఉన్న
పరిమితమైన
అధికారాల
వల్ల
భారీ
మార్పులు
చేసే
అవకాశం
లేదని
వారంటున్నారు.
- ప్రమాదవశాత్తు రాజకుటుంబం మృతి!
- భారత్దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
- తండ్రిని చంపిన దీపేంద్రుడే నేపాల్ రాజు
- ెనపాల్ ఆఖరు సామ్రాట్టు
- రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
- నేపాల్ రాజ దంపతుల హత్య