రష్దీపై ఫత్వాకు ఇరాన్ చెల్లుచీటి
దుబాయ్ః భారత దేశంలో జన్మించ,బ్రిటన్ లో స్థిరపడిన ప్రముఖ రచయిత సాల్మన్ రష్దీ కేసు మూతపడినట్లేనని ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ ఖతామి ప్రకటించారు. రష్దీ నవలసెటానిక్ వర్సెస్ ఇస్లాంకు వ్యతిరేకంగా వున్నదంటూ ఇరాన్ మతగురువు అయతుల్లా ఖొమైనీ 1989లో ఫత్యా జారీ చేసినవిషయం విదితమే. ఈ ఫత్వాకు భయపడిన రష్దీ చాలాకాలం ప్రవాస జీవితం గడిపారు. ఇరాన్ ఫత్యాకు నిరసనగాబ్రిటన్ ఆ దేశంతో సంబంధాలను కూడా తెగతెంపులు చేసుకుంది.
రష్దీ వ్యవహారం ఇంతటితో ముగిసిపోయినట్లేనని ఇరాన్ అధ్యక్షుడు ఓ పర్షియన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పాశ్చాత్య దేశాల ప్రోద్బలంతో ఇస్లాంకు, ఇస్లాంవిప్లవానికి రష్దీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భావస్వాతంత్ర్యానికి ఇరాన్ ఎన్నడూ వ్యతిరేక కాదు. అయితే ఇస్లాం పవిత్రతను దెబ్బతీసే వ్యాఖ్యలను ఏ ఒక్క ముస్లిం కూడా సహించలేడని ఇరాన్ అధ్యక్షుడు వ్యాఖ్యానించాడు.
దశాబ్దికాలం క్రితం జరిగిన సంఘటన గురించి ప్రస్తుతం మేము ఏమీ ఆలోచించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అధ్యక్షుడిగా కతామీ రెండో సారి ఎన్నికఅయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతర్జాతీయంగా ఇరాన్ కు గల మతపరమైన ముద్ర నుంచి బయటపడేందుకు కతామీ ప్రయత్నాలు చేస్తున్నారనడానికి రష్దీపై ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనాలని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.