ప్రత్యేక తెలంగాణాకు బిజెపి నో
న్యూఢిల్లీః ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని భారతీయ జనతాపార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది. తెలంగాణాతో పార్టు ఏ చిన్న రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని బిజెపి అధ్యక్షుడు జానా కృష్ణమూర్తి బుధవారం కొత్తఢిల్లీలో తేల్చి చెప్పారు. 1997లో బిజెపి రాష్ట్ర కాకినాడలో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసిందని, అయితే అప్పటికీ ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవించాయని కృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు బిజెపి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన వివరించారు.
ఎన్డీఏ ఎజెండాలో ప్రత్యేక తెలంగాణా ఊసే లేదని, ఎన్డీఏ ఎజెండాకు అనుగుణంగా మాత్రమే దేశంలో పరిపాలన సాగుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడే కాదు... 2004 వరకు ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుపై ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటును సమర్థిస్తూ బిజెపి రాష్ట్ర శాఖ కాకినాడ సభలో తీర్మానించింది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకంగా వుండడం..... కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మనుగడకు తెలుగుదేశం పార్టీ మద్దతు తప్పని సరి కావడంతో బిజెపి సంకటంలో పడింది.
తెలంగాణాకు
చెందిన
పలుపులు
బిజెపి
ఎమ్మెల్ల్యేలు
ఇప్పటికే
తెలంగాణాపై
బిజెపి
వైఖరిని
స్పష్టం
చేయాలని
డిమాండ్
చేస్తున్నారు.
ప్రత్యేక
తెలంగాణాకు
మద్దతు
ఇవ్వకపోతే
తెలంగాణాపై
బిజెపి
పట్టుకోల్పోతుందని
ఆ
నాయకులు
ఆందోళన
చెందుతున్నారు.
ఇటీవల
జరిగిన
పదాథికారుల
సమావేశంలో
కూడా
తెలంగాణా
అంశంపై
కేంద్ర
పార్టీదే
తుదినిర్ణయంఅంటూ
తీర్మానించారు.
తెలంగాణాను
సమర్థించేందు
లేదని
జానా
కృష్ణమూర్తి
స్పష్టం
చేయడంపై
తెలంగాణాకు
చెందిన
బిజెపి
ఎమ్మెల్ల్యేలు
ఎలా
స్పందిస్తారో
వేచి
చూడాలి.