వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్‌ లో 40శాతం పాస్‌-బాలికలేటాప్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలను ఇంటర్మీడియట్‌ బోర్డు బుధవారం విడుదల చేసింది. మార్చి 29 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 19 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షా ఫలితాలను నెలరోజుల్లో విడుదల చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ఇంటర్‌ బోర్డు నానా తంటాలు పడి సుమారు రెండు నెలలకు ఫలితాలు విడుదల చేసింది.

సుమారు ఆరు లక్షల మంది పరీక్షలకు హాజరు కాగా 40 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అది కూడా బాలికలు అధికశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫలితాలలో కృష్ణా జిల్లా 65 శాతంతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. మహబూబ్‌ నగర్‌ జిల్లా 25 శాతం ఉత్తీర్ణతతో అట్టడుగు స్థాయిలో నిలిచింది. జూలై 2 నుంచి ఇంటర్‌ ఇన్‌ స్టంట్‌ పరీక్ష నిర్వహిస్తామని ఇంటర్‌ కార్యదర్శి ప్రకటించారు.

ఇంటర్‌ ఫలితాల విడుదల సందర్భంగా గందరగోళం నెలకొంది. ఫలితాలను అధికారికంగా విడుదల చేయడానికి ముందే అధికారులు ఒక పత్రికకు ఫ్లాపీ ఇచ్చిందంటూ మిగిలిన పత్రికల వారు నిరసన వ్యక్తం చేశారు. దీనితో కొద్ది సేపు గందరగోళం నెలకొంది.

క్రిక్కిరిసిన ఇంటర్నెట్‌ సెంటర్లు
ఇంటర్‌ ఫలితాలు వెల్లడి కావడంతో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో వున్న సైబర్‌ కేఫ్‌ లు క్రిక్కిరిసి పోయాయి. ఫలితాలు వెల్లడైన కొద్దిసేపటికే తిరుపతి, విజయవాడ, గుంటూరు తదితర పట్టణాలలోని విద్యార్థులు మార్కులతో సహా ఫలితాలు తెలుసుకున్నారు. అంతా ఒకేసారి లాగాన్‌ కావడంతో ఇంటర్‌ బోర్డు హోం పేజ్‌ కొద్ది సేపు జామ్‌ అయింది. దీనితో రెండు రోజుల నుంచి ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసి, విద్యార్థుల నుంచి మార్క్స్‌ లిస్ట్‌ ప్రింట్‌ అవుట్‌ ఇచ్చేందుకు డబ్బుతీసుకున్న సైబర్‌ కేఫ్‌ ల నిర్వాహకులు కిందామీదా పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X