ఖాట్మండులో కర్ఫ్యూ ఎత్తివేత
ఖాట్మండ్: నేపాల్ రాజధానిఖాట్మండులో బుధవారం కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేశారు. పరిస్థితిఅదుపులోకి వచ్చింది. క్రమంగా సాధారణ పరిస్థితులునెలకొంటున్నాయి. అయితే, మళ్లీ కర్ఫ్యూఎప్పుడైనా విధించవచ్చుననే భయం ప్రజలనువీడలేదు. దుకాణాలు తెరిచారు. ప్రశాంతంగా వుండాలనిహోం మంత్రి రామ్ చంద్ర పాడేల్ ప్రజలకు ప్రభుత్వ రేడియో ద్వారావిజ్ఞప్తి చేశారు.
హతుడైన రాజుబీరేంద్ర స్థానంలో ఆయన సోదరుడుజ్ఞానేంద్ర సోమవారం పట్టాభిషిక్తుడైనవెంటనే నిరసన వెల్లువ పెల్లుబికింది.మంగళవారం చెలరేగిన హింసాకాండలోముగ్గురు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు.
ఖాట్మండు వీధులుబుధవారం ప్రశాంతంగా, బిజీగా వున్నాయి. మనం ఇంకావిషాదంలోనే వున్నాం. అల్లర్లు సృష్టించడంమంచిది కాదు అని పాడేల్ అన్నారు. పిల్లలనువీధుల్లోకి రానీయవద్దని ఆయనతలిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లలువీధుల్లోకి వస్తే వారిని అసాంఘిక శక్తులు తప్పుదోవపట్టించే ప్రమాదం వున్నదని ఆయన అన్నారు.
రాజకుటుంబ సభ్యులహత్యోదంతంపై రాజు జ్ఞానేంద్ర ప్రకటించినముగ్గురు సభ్యులతో కూడిన విచారణ సంఘంచిక్కుల్లో పడింది. తాము విచారణ సంఘంలో చేరబోమని ప్రధానప్రతిపక్షమైన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాధవ్ కుమార్నేపాల్ ప్రకటించారు. ఇద్దరు సభ్యులతోనే పని ప్రారంభించాలనిహోం మంత్రి పాడేల్ ఒత్తిడి తెచ్చారు. వీరిద్దరుసమావేశమై తాము ఏ విధంగా పని చేయాలనేవిషయమై చర్చించుకుంటారు.