వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాపై అంచనాకుహైదరాబాద్‌కు ప్రణబ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌పై పరిస్థితినిస్వయంగా అంచనా వేసేందుకు ఎఐసిసి చిన్న రాష్ట్రాలవ్యవహారాల సబ్‌ కమిటీ అధ్యక్షుడు ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌వస్తున్నారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు మంగళవారం ఎఐసిసి చిన్న రాష్ట్రాలవ్యవహారాల సబ్‌ కమిటీతో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌పై, రాష్ట్రంలోనిపరిణామాలపై ఆయన సబ్‌ కమిటీకి వివరించారు. సబ్‌కమిటీతో ఏం మాట్లాడిందీ వెల్లడించడానికిసత్యనారాయణరావు నిరాకరించారు. నేనుచెప్పాల్సిందేదో చెప్పానంతే అని ఆయన విలేకరులతోఅన్నారు. ప్రత్యేక తెలంగాణాపై సత్వర నిర్ణయం తీసుకోవాలని సూచించారా అని అడిగితే నోకామెంట్‌ అని మాత్రమే ఆయన జవాబిచ్చారు.

ప్రణబ్‌ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో మన్మోహన్‌ సింగ్‌, ఆస్కార్‌ఫెర్నాండెజ్‌, మోతీలాల్‌ వోరా, అంబికా సోనీపాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. జనార్దన్‌ రెడ్డి, ఎఐసిసికార్యదర్శి టి. సుబ్బరామిరెడ్డి సబ్‌ కమిటీతోసమావేశమయ్యారు.

ఎం. సత్యనారాయణరావు మంగళవారంముందుగా వోరాతో సమావేశమయ్యారు. ఆ తర్వాతఅంబికాసోనీతో మాట్లాడారు. సబ్‌ కమిటీ సమావేశం తర్వాతమరోసారి ఆయన ఈ ఇద్దరితో సమావేశమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X