వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర బిజెపి నెత్తిన పిడుగు!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు ప్రసక్తి లేదంటూ బిజెపి అధిష్ఠానం ప్రకటించడంతో బిజెపి రాష్ట్ర శాఖ అంతర్మథనంలో పడింది. ముఖ్యంగా పార్టీలో వున్న తెలంగాణాకు చెందిన నాయకులు అధిష్ఠానం నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. తెలంగాణా సాధ్యం కాదంటూ బిజెపి అధిష్ఠానం కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయంతో తెలంగాణాలో భారతీయ జనతాపార్టీ ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణాపై అధిష్ఠానం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాల్సిందిగా మెదక్‌ ఎం.పి. ఎం. నరేంద్ర కోరారు. అధిష్ఠానం నిర్ణయం వల్ల తెలంగాణాలో బిజెపి పట్టుకోల్పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబు నగర్‌ ఎం.పి. జితేందర్‌ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణాపై బిజెపి అధిష్ఠానం తన నిర్ణయాన్ని తిరిగి ఆలోచించాలని ఆయన కోరారు. బిజెపికి చెందిన పలువురు తెలంగాణా ఎమ్మెల్ల్యేలు కూడా కేంద్ర పార్టీ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ రాష్ట్ర శాఖలో ముసలం పుట్టిస్తుందనే భయాందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కాంగ్రెస్‌, సిపిఎం ధ్వజంః
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదంటూ బిజెపి అధిష్ఠానం ప్రకటించడంపై కాంగ్రెస్‌, సిపిఎం పార్టీలు ధ్వజమెత్తాయి. బిజెపి అవకాశవాదానికి ఇది నిదర్శనం అని ఆపార్టీలు ప్రకటించాయి. కాకినాడలో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేస్తామంటూ తీర్మానించిన బిజెపి ఇప్పుడు మాటమార్చడంలో ఆంతర్యం ఏమిటని కాంగ్రెస్‌ తెలంగాణా నేతల ఫోరం విమర్శించింది. నిజాయితీ వున్నా పార్టీగా చెప్పుకొనే బిజెపి నిజాయితీ ఇప్పుడు ఎటుపోయిందని సిపిఎం నేత బి.వి. రాఘవులు గురువారం విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X