వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశం నేతను కాల్చి చంపిన నక్సల్స్
వరంగల్ః హనుమకొండ మండలప్రజాపరిషత్ అధ్యక్షుడు యాదగిరితో పాటు మరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తనుపీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు బుధవారం అర్థరాత్రి కాల్చి చంపారు. స్థానిక గెరిల్లా స్క్వాడ్ కు చెందిన ముగ్గురు నక్సలైట్లు మణికొండ గ్రామంలోని యాదగిరి ఇంటికి చేరుకున్నారు. స్కూటర్ పై యాదగిరి ఇంటికి చేరుకున్న నక్సలైట్లు ఆయనను ఇంట్లో నుంచి బయటకు పిలిచారు. ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నావని ఆరోపిస్తూ ఎంపిపి అధ్యక్షుడు యాదగిరిని అత్యంత సమీపం నుంచి నక్సలైట్లు కాల్చి చంపారు.
నక్సలైట్ల
చర్యను
అక్కడే
వున్న
తెలుగుదేశం
కార్యకర్త
అడ్డుకున్నాడు.
అతనిని
కూడా
నక్సలైట్లు
కాల్చి
చంపారు.
ఈ
సంఘటన
వరంగల్
జిల్లాలో
సంచలనం
సృష్టించింది.
Comments
Story first published: Thursday, June 7, 2001, 23:53 [IST]