వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాట్మండులో కర్ఫ్యూ ఎత్తివేత

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండు: నేపాల్‌ రాజప్రాసాదంలో జరిగిన ఊచకోత దరిమిలా చెలరేగిన అల్లర్లను అదుపుచేసేందుకు ఖాట్మండులో విధించిన కర్ఫ్యూను శుక్రవారం ఎత్తివేశారు. రాజకుటుంబం హత్యోదంతంపై ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిషన్‌ విచారణ కూడా ప్రారంభమయింది.

నేపాల్‌ రాజు బీరేంద్ర ఆయన అర్ధాంగి రాణి ఐశ్వర్యల దారుణ హత్యకు నిరసనగా ప్రజలు హింసాత్మక సంఘటనలకు పాల్పడుతుండటంతో జూన్‌ నాలుగున కర్ఫ్యూ ప్రకటించిన విషయం విదితమే.
రాచకుటుంబం ఊచకోతకు రాకుమారుడు దీపేంద్రనే కారకుడన్న వార్తను నేపాల్‌ ప్రజలు ఇప్పటికీ కూడా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. దీనివెనక ఏదో కుట్ర వున్నదనే అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతున్నది.

బీరేంద్ర వారసునిగా సింహాసనం అధిష్టించిన జ్ఞానేంద్ర రాజప్రాసాదాన్ని రక్తసిక్తం చేసిన హత్యలపై విచారణకు తాను ఏర్పాటు చేసిన కమిషన్‌కు విస్తృత అధికారాలు ఇచ్చారు. ఈ కమిషన్‌లో నియమించిన ముగ్గురు సభ్యుల్లో ఒకరైన నేపాల్‌ ప్రతిపక్ష పార్టీ నేత మాధవ్‌కుమార్‌ నేపాల్‌ కమిషన్‌లో చేరడానికి తిరస్కరించారు. నేపాల్‌ ప్రధాన న్యాయమూర్తి, స్పీకర్‌ సభ్యులుగా వున్న ఈ కమిషన్‌ ప్రత్యక్ష సాక్షులందరినీ విచారించిన తర్వాత తన దర్యాప్తులో వెల్లడయిన అంశాలను బహిరంగ పరుస్తుంది.

ఇదిలా వుండగా ప్రత్యక్ష సాక్షి కథనం పేరిట లండన్‌, న్యూయార్క్‌ నుంచి వెలువడే పత్రికలు ప్రచురించిన కథనాలపై నేపాల్‌ పత్రికలు ఒక్క ముక్క కూడా రాయలేదు. రాచకుటుంబం ఊచకోతలపై భిన్న కోణంలోంచి వార్తను ప్రచురించిన నేపాలీ దినపత్రిక ఎడిటర్‌, ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి రాజద్రోహం నేరంపై కేసులు పెట్టడంతో స్థానిక పత్రికల్లో భయాందోళనలు వ్యాపించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X