వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులాసాగా ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: ప్రధాని వాజ్‌పేయి కుడిమోకాలి శస్త్ర చికిత్స తర్వాత ఉల్లాసంగా వున్నారని ప్రధానికి చికిత్స చేసిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ చిత్తరంజన్‌ రణావత్‌ తెలిపారు. ఏడాది క్రితం ప్రధాని వాజ్‌పేయి ఎడమమోకాలికి చేసినట్టుగానే ఈ సారి కుడిమోకాలికి కూడా మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్‌ చేసినట్టుగా గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

వాజ్‌పేయి ఆపరేషన్‌ తర్వాత ఉల్లాసంగాకనిపిస్తున్నారని మరో వారం, పదిరోజుల పాటు ఆయన ఆస్పత్రిలో వుండాల్సి వుంటుందని రణావత్‌ అన్నారు. అయితే పక్కమీదనుంచి లేచి తిరగడానికి మాత్రం రెండు మూడు రోజుల కంటే ఎక్కువ పట్టదని రణావత్‌ వివరించారు. ప్రధానికి నిర్వహించినటువంటి మోకాలి చిప్ప మార్పిడి కేసుల్లో 90 శాతం వరకు 15 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వుంటాయని ఆయన తెలిపారు.

శస్త్ర చికిత్స సమయంలో ప్రధాని పూర్తి మెలుకువగా వున్నారని ఆయన వెల్లడించారు.ప్రధాని ఎడమ మోకాలికి ఆపరేషన్‌ చేసిన కారణంగా పద్మ భూషణ్‌ అవార్డు అందుకోవడానికి అర్హత లభించిందంటారా అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈ ప్రశ్నఅవార్డుకు తన పేరును సిఫారసు చేసిన వారిని అడగాలని ఆయన అన్నారు. కుడిమోకాలి ఆపరేషన్‌ తర్వాత భారతరత్న లభిస్తుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా రణావత్‌ పెద్దగా నవ్వుతూ, వస్తే వస్తుందేమో అన్నారు.

ప్రధాని మోకాళ్లకు సంబంధించినంత వరకు ఇదే చివరి సర్జరీ అనే ఆశిస్తున్నానని మరోప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. గురువారం నాడు ప్రధానికే కాకుండా మరో ఇద్దరికి కూడా మోకాలు చికిత్స చేసిన రణావత్‌ ఈ ట్రిప్పులో 15-20 మంది వరకు పేషెంట్లు వున్నట్టుగా తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X