భారత్ 318 ఆలౌట్-జింబాంబ్వే 79/3
బులవాయోః జింబాంబ్వేతో ఇక్కడ జరుగుతున్న తొలిటెస్ట్ రెండో రోజున భారత్ 318 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాంబ్వే 79 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలిఇన్నింగ్స్ లో 145 పరుగులు ఆధిక్యత సాధించిన భారత్ బౌలర్లు సహకరిస్తే ఈ టెస్ట్ సునాయాసంగా గెలుచుకొనే అవకాశం వుంది.
భారత్ ఇన్నింగ్స్ లో సచిన్ టెండుల్కర్, హర్భజన్ సింగ్ మినహా ఎవ్వరూ గౌరవప్రదమైన స్కోరు సాధించలేదు. టెండుల్కర్ అద్భుతంగా ఆడి 74 పరుగులు చేశాడు. టెయిల్ ఎండ్ బ్యాట్స్ మెన్ హర్భజన్ సింగ్ అద్భుతంగా ఆడి 76 బంతుల్లో 66 పరుగులు చేసి భారత్ పరువు దక్కించాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ వుండడం విశేషం. రాహులు ద్రావిడ్ 44, వికెట్ కీపర్ సమీర్ డిఘే కూడా 47 పరుగలు సాధించి భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు తోడ్పడ్డాడు.
శుక్రవారం ఆట ప్రారంభమైన వెంటనే నైట్ వాచ్ మెన్ గా వచ్చిన శ్రీనాధ్ అవుటయ్యాడు. ఆ తరువాత కెప్టెన్ సౌరభ్ గంగూలీ కేవలం ఐదు పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. ఓ పైవు వికెట్లు వరసగా కుప్పకూలిపోతున్నా సచిన్ చక్కని ఏకాగ్రతతో ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన తరువాత సచిన్ విజృంభించి ఆడాడు. ఒక ఓవర్ లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి జింబాంబ్వే బౌలర్లలో వణుకు పుట్టించాడు. చివరకు కార్లైల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సచిన్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ ఇన్నింగ్స్ లో హర్భజన్ సింగ్ ఆట చూడముచ్చటగా సాగింది. సమీర్ డిఘే, హర్భజన్ సింగ్ ల పుణ్యమా అని భారత్ 145 పరుగులు ఆధిక్యం సంపాదించింది.
రెండో
ఇన్నింగ్స్
ప్రారంభించిన
జింబాంబ్వే
మూడో
ఓవర్
లోనే
ఒక
వికెట్
కోల్పోయింది.
రెండో
రోజు
ఆట
ముగిసే
సమయానికి
జింబాంబ్వే
79
పరుగులకు
మూడు
వికెట్లు
కోల్పోయింది.
శ్రీనాధ్
రెండు
వికెట్లు,
హర్భజన్
సింగ్
ఒక
వికెట్
సాధించారు.