ఆరులక్షల మందికిచేపమందు
హైదరాబాద్: ఆస్త్మా రోగులకు మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ బత్తిన సోదరులు ఉచితంగా పంపిణీ చేసే చేపమందు కోసందేశవిదేశాల నుంచి ఆరులక్షల మందికి తరలివచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మందుపంపిణీకోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని చోట్ల తొక్కిసలాట తప్పలేదు.
వాతావరణం చల్లగా వుండటం శుక్రవారం వేకువజామునుంచే క్యూలో వున్నవారికి ఊరటనిచ్చింది. మృగశిర కార్తె ప్రవేశం తోటే రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి నరసింహారావుకు తొలుత ఈ చేపమందును బత్తిన సోదరులు ఇచ్చారు. మందుకోసం వచ్చిన వారికి చేపపిల్లలు అందేలా ఈ సారి ప్రభుత్వం 40 పైగా కౌంటర్లను ఏర్పాటు చేసింది. మందు తీసుకున్న వారు తాము చెప్పిన నియమాలను తప్పకుండా పాటించాలని బత్తిన సోదరులు సూచించారు. పథ్యం పాటిస్తేనే మందు బాగాపనిచేస్తుందని వారు వెల్లడించారు.
చేపమందు
తీసుకున్న
చంద్రబాబు
బత్తిన
సోదరులు
ఇచ్చే
చేపమందును
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
తీసుకున్నారు.
ఏ
మాత్రం
ప్రతిఫలం
ఆశించకుండా
బత్తిన
సోదరులు
చేపమందును
ఉచితంగా
పంపిణీ
చేయడం
పట్ల
వారికి
ఆయన
అభినందనలు
తెలిపారు.
రద్దీని బట్టి శనివారం ఉదయం వరకు చేపమందును పంపిణీ చేస్తామని బత్తిన సోదరులు ప్రకటించారు.శుక్రవారం రాత్రి వరకు కూడా వేలాది మంది ఆస్తమా రోగులు ఎగ్జిబిషన్ గ్రౌడ్స్ కు తరలి వస్తున్నారు. చేప మందు కోసం వస్తున్న విదేశీయులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.