కారుచౌక రేట్లతో ఎంటిఎన్ఎల్సెల్
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో టెలీఫోన్ సర్వీసులను నిర్వహిస్తున్న మహానగర్ టెలీఫోన్ నిగమ్ లిమిటెడ్ సంస్థ సెల్ ఫోన్ రేట్లను (ఇన్కమింగ్-ఔట్ గోయింగ్) నిమిషానికి 1.40 పైసలకు తగ్గించాలని నిర్ణయించింది. చార్జీల తగ్గింపుతో పాటు నెలసరి కిరాయిని 375 రూపాయలకు తగ్గించాలని కూడా ప్రతిపాదిస్తున్నది.
ప్రస్తుతం ఎంటిఎన్ఎల్ నెలవారి అద్దె 400 రూపాయలు వుండగా ఇన్కమింగ్కాల్స్కు నిమిషానికి 1.50 రూపాయలు, ఔట్గోయింగ్ కాల్స్కు నిమిషానికి 2.70 రూపాయ చొప్పున వసూలు చేస్తున్నారు. సెల్ ఫోన్ ఆపరేటర్ల మధ్య పోటీ తీవ్రంగా వున్న ముంబాయిలో చార్జీల తగ్గింపు వీలున్నంత తొందరగా అమల్లోకి వస్తుందని మిగిలిన నగరాల్లో ఎప్పుడు తగ్గించాలనే విషయం తర్వాత నిర్ణయిస్తారని ఎంటిఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. ముంబాయి ఢిల్లీ నగరాల్లో ఎంటిఎన్ఎల్కు సెల్ఫోన్ సర్వీసుల మార్కెట్లో కనీసం రెండు శాతం కూడా వాటా లేదని అయితే ఈ సంస్థ రేట్లను పూర్తిగా అట్టడుగుస్థాయికి తగ్గించడం వల్ల వినియోగదారులు గణనీయంగా లాభపడే అవకాశం వున్నదని మార్కెట్ వర్గాలుఅంటున్నాయి.
- పెరిగిన సత్యం బ్రాండ్ విలువ
- పేదలకోసం సింప్యూటర్లు