పెరిగిన సత్యం బ్రాండ్ విలువ
హైదరాబాద్:అమెరికన్ కాపిటల్ మార్కెట్ నుంచి ఎడిఎస్ల జారీతో ఈ మధ్యనే 16 కోట్ల డాలర్లను సమీకరించిన హైదరాబాద్ సంస్థ సత్యం కంప్యూటర్స్ తాజాగా మరో 2 కోట్ల డాలర్ల సమీకరణకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మొత్తాన్ని సమీకరించడానికి వీలుగా ఈ నెల 29న జరిగే షేర్హోల్డర్ల సమావేశం అనుమతి తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది.
ఈ మొత్తాన్ని ఇష్యూ ద్వారా కాకుండా వ్యూహాత్మక భాగస్వామికి లేదా ఎంపిక చేసిన మ్యూచువల్ఫండ్, ఎఫ్ఐఐకి ప్రైవేట్ ప్లేస్మెంట్ పద్దతిలో షేర్లను కేటాయించడం ద్వారా లేదా ప్రిఫరెన్షియల్ ఇష్యూ మార్గంలో సమీకరిస్తారు. నేరుగా ఈక్విటీ షేర్లను కేటాయించలా లేక కన్వర్టబుల్ వారెంట్స్ జారీ చేయాలా అన్న విషయం ఇంకా నిర్ణయించలేదని సత్యం వర్గాలు చెప్పాయి.
ఇదిలా వుండగా ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో సత్యం బ్రాండ్ వాల్యూ మరో 50 శాతం హెచ్చింది. గత మూడేళ్ల కాలం లాభాల సగటు ఆధారంగా వేసిన లెక్కల ప్రకారం సత్యం బ్రాండ్ నికర విలువ 2274 కోట్లరూపాయలు వుంటుందని అంచనా.
- కారుచౌక రేట్లతో ఎంటిఎన్ఎల్ సెల్
- పేదలకోసం సింప్యూటర్లు