వాజ్పేయితో దోస్తీకి జయ ఆరాటం
న్యూఢిల్లీ: ప్రధాని వాజ్పేయితో సంధికి తమిళనాడు నేత జయలలిత తనదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించారు. జరిగిందేదో జరిగిపోయింది, గతాన్ని మర్చిపోదామనే ధోరణి ఆమె ఎన్డిఎ నేతలతో వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని వాజ్పేయి ముంబాయి బయలుదేరి వెళ్లే ముందు ఢిల్లీలో ఆయన్ను కలసిన జయ శాలువను బహుకరించారు. శాలువతో పాటు శ్వేత గులాబీల గుచ్ఛాన్ని కూడా ప్రధానికి అందజేశారని ప్రధాని సన్నిహితులు చెప్పారు.
1998లో ఎన్డిఎలో భాగస్వామిగా వున్న జయలలిత హఠాత్తుగా అడ్డంతిరగడంతోనే వాజ్పేయి ప్రభుత్వం కుప్పకూలిన విషయం విదితమే. ఎన్డిఎ నేతలకు జయలలితపై అప్పటి కోపం ఇంకా వున్నప్పటికీ పాత కోపాలను మనసులో పెట్టుకోకుండా కొత్త స్నేహాన్ని ప్రారంభించాలనే జయలలిత కోరికను ఎన్డిఎ నేతలు అంత తేలిగ్గా తీసిపారేయలేకపోతున్నారు. తమిళనాడులో ఆమె సాధించిన పట్టు అందుకు కారణమని చెప్పవచ్చు. పైగా వాజ్పేయిని కలిసిన తర్వాత కాంగ్రెస్ నేత సోనియాను కూడా కలసిన జయలలిత కాంగ్రెస్తో తమ నెయ్యం ఎన్నికలకే పరిమితమని బాంబులాంటి ప్రకటన చేశారు.
కాంగ్రెస్తో
దోస్తీ
విషయంలో
ఆమె
చేసిన
ప్రకటన
కూడా
ఎన్డిఎ
నేతల
మెప్పుకేనని
అంటున్నారు.
ఎన్డిఎకు
జయ
అందిస్తున్న
స్నేహహస్తం
రానున్న
రోజుల్లో
రాజకీయ
సమీకరణల్లో
మార్పుకు
దొహదం
చేసే
అవకాశం
వుంది.