ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట
హైదరాబాద్: ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్ధులకే ప్రాధాన్యత నిచ్చేందుకు ఉద్దేశించిన జివో 610 అమలుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవో అమలు వ్యవహారంపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టుగా హోం మంత్రి దేవేందర్గౌడ్ శుక్రవారం నాడు వెల్లడించారు. అవసరమైతే ఈ జీవోపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు.
వచ్చే
డిఎస్ఇ
నుంచే
ఈ
జీవో
610
అమలు
చేయాలని
ప్రభుత్వం
భావిస్తున్నట్టుగా
ఆయన
వెల్లడించారు.
డిఎస్ఇ
నియామకాల్లో
పలు
తెలంగాణాజిల్లాల్లో
అవకాశాలను
స్థానికేతరులుతన్నుకు
పోతున్నారన్న
ఆరోపణలను
ప్రస్తావిస్తూ
జివో
610
అమలును
కట్టుదిట్టం
చేయాలని
ప్రభుత్వం
నిర్ణయించినట్టుగా
ఆయన
చెప్పారు.
ప్రత్యేక
తెలంగాణ
రాష్ట్ర
ఉద్యమం
ఊపందుకుంటున్న
నేపథ్యంలో
ప్రభుత్వం
ఈ
కీలక
నిర్ణయం
తీసుకోవడం
గమనార్హమని
పరిశీలకులుఅంటున్నారు.
బ్యాక్
లాగ్
పోస్టుల
భర్తీ
తెలంగాణా
ఉద్యమం
తీవ్రతను
అడ్డుకొనేందుకు
ప్రభుత్వం
హడావుడిగా
చర్యలు
ప్రారంభించింది.
తెలంగాణా
ప్రాంతం
ఉద్యోగులకు
అదనపు
సౌకర్యం
కల్పించే
జి.ఓ.
610పై
రెండు
రోజుల్లో
చర్యలు
తీసుకుంటామని
ప్రభుత్వం
ప్రకటించింది.
అదేవిధంగా
రెండు
నెలల్లోగా
8
వేల
ఎస్.సి.
ఎస్.టి
బ్యాక్
లాగ్
పోస్టులు
భర్తీ
చేస్తామని
రాష్ట్ర
సాంఘిక
సంక్షేమ
శాఖ
మంత్రి
పుష్పలీలు
శుక్రవారం
ప్రకటించారు.
త్వరలో జరిగే టీచర్ పోస్టులు, వేలాది జూనియర్ లెక్చరర్ల భర్తీలో కూడా స్థానికులకు అధిక ప్రాధాన్యత నివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. జీ.ఓ. 610 అమలుపై అవసరమైతే త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది.