వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై త్వరలో తుది నిర్ణయం: బిజెపి
హైదరాబాద్ : పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రామారావుతో చర్చించి ప్రత్యేక తెలంగాణాపై నిర్ణయం తీసుకుంటామని బిజెపి రాష్ట్ర శాఖ ప్రకటించింది. రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో వున్న ఉపాధ్యక్షుడు రామారావు హైదరాబాద్కు తిరిగివచ్చిన వెంటనే తెలంగాణా విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణా విషయంలో కేంద్ర నాయకత్వం తీసుకున్న వైఖరిపై కార్యకర్తలు, నాయకులలో ఎలాంటి అసంతృప్తీ లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకలు, కార్యకర్తలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వున్నారని ప్రభాకర్ తెలిపారు.
Story first published: Friday, June 8, 2001, 23:53 [IST]