వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంతో పొత్తుపై 16 బిజెపి నిర్ణయం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడః రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకొనేదీ లేనిదీ త్వరలో నిర్ణయిస్తామనిబిజెపి సీనియర్‌ నాయకుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. శుక్రవారంవిజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈనెల 16,17 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలుగుదేశంతో పొత్తు గురించి చర్చిస్తామని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకోసం పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్లు వెంకయ్య నాయుడు వివరించారు.
ప్రత్యేక తెలంగాణా ప్రసక్తి లేదంటూ పార్టీ అధ్యక్షుడు జానా కృష్ణమూర్తి తేల్చి చెప్పినందు వల్ల ఆ అంశంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

కాంగ్రెస్‌ పై మండిపడ్డ వెంకయ్య
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేంద్రంలోని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌, వామపక్షపార్టీలు శతవిధాలా ప్రయత్నించాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్య నాయుడు ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ప్రజలలో వున్న వ్యతిరేకతకు నిదర్శనంఅంటూ కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు చేస్తున్న వాదనలోఅర్థం లేదని ఆయన అన్నారు. శుక్రవారం ఆయనవిజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడూతూఅసెంబ్లీ ఎన్నికలు స్థానిక అంశాలపైన, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల మధ్య జరిగాయని, ఐదు రాష్ట్రాలలో ఎక్కడా బిజెపి బలమైన పార్టీ కాదని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌, వామపక్షాలు పచ్చి అవకాశవాద రాజకీయ పార్టీలను ఆయన ధ్వజమెత్తారు. దోషిగా కోర్టు నిర్ధారించిన జయలలితతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తుపెట్టుకోవడం ఆ పార్టీ నీతిబాహ్యతకు నిదర్శనమని వెంకయ్య నాయుడు మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలలో అక్కడి ప్రతిపక్షాలలో నెలకొన్న విభేదాలకుఅసెంబ్లీ ఎన్నికలు అద్దం పట్టాయని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X