వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెండింగ్‌ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: గోదావరి నదిపై తలపెట్టిన పెండింగ్‌ నీటి పారుదల ప్రాజెక్టులకన్నింటికీ క్లియరెన్స్‌ సాధించేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. తెలంగాణాలోని ప్రతిపాదిత నీటిపారుదల ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగించడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం ఇక్కడికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరంతో పాటు అన్ని నీటి పారుదల ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ సాధిస్తామని ఆయన చెప్పారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని పెన్‌గంగ, డెండీ ప్రాజెక్టులను చేపట్టునున్నట్లు ఆయన తెలిపారు.

జన్మభూమి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. జన్మభూమికి ఇంత పెద్ద యెత్తున స్పందన లభించడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు నూతనోత్సాహంతో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. మహిళలు భారీ తరలి వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ జన్మభూమికి 239 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. రెండేళ్లు అధికారులకు శిక్షణ ఇచ్చి జన్మభూమి కార్యక్రమం అమలుకు సమాయత్తం చేశామని, జన్మభూమి కార్యక్రమంలో నూతన పద్ధతులు ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X