జింబాబ్వేను ఆదుకున్న ఫ్లవర్ సోదరులు
బులవాయో: భారత్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో శనివారం మూడో రోజు ఫ్లవర్ సోదరులు నిలకడగా ఆడి జింబాబ్వే జట్టును ఆదుకున్నారు. శనివారం ఆట ముగిసే సమయానికి జింబాబ్వే జట్టు తన రెండవ ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. గ్రాంట్ ఫ్లవర్ 67 పరుగులతో, బ్లిగాట్ 11 పరుగులతో క్రీజ్లో వున్నారు. జింబాబ్వే భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్పై 158 పరుగుల ఆధిక్యత సాధించింది. వాతావరణం సరిగా లేకపోవడంతో నిర్ణీత వ్యవధి కన్నా ముందుగానే శనివారం ఆట ముగిసింది. ఫ్లవర్ సోదరులు భారత స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కుని వంద పరుగులకు పైగా జోడించారు.
శుక్రవారం
రెండో
ఇన్నింగ్స్
ప్రారంభించిన
జింబాబ్వే
త్వరత్వరగా
వికెట్లు
కోల్పోయి
కష్టాల్లో
పడింది.
ఒక
సందర్భంలో
86
పరుగులకే
నాలుగు
వికెట్లు
కోల్పోయింది.
కార్లయిల్
52
పరుగులు
చేశాడు.
కార్లయిల్తో
పాటు
ఫ్లవర్
సోదరులు
అర్థ
సెంచరీలు
చేసి
జింబాబ్వే
జట్టును
గట్టెక్కించారు.
ఆండీ
ఫ్లవర్
83
పరుగులు
చేశాడు.
భారత్
బౌలర్లు
శ్రీకాంత్,
నెహ్రా,
జహీర్
ఖాన్లు
రెండేసి
వికెట్లు
తీసుకున్నారు.
హర్బజన్
సింగ్కు
ఒక
వికెట్
లభించింది.
జింబాబ్వే
తన
మొదటి
ఇన్నింగ్స్లో
173
పరుగులకే
వికెట్లను
అన్నింటిని
కోల్పోగా,
భారత్
318
పరుగులు
చేసింది.