వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగరేణి గునుల్లో కార్మిక సమ్మె

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: సింగరేణి బొగ్గు గనుల్లో శనివారంనాడు కార్మికులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మె మొదలు పెట్టారు. గోదావరిఖని ప్రాంతంలో 32 మంది ఆపరేటర్లను పోలీసులు నిర్బంధించి పని చేయించే ప్రయత్నం చేయడం పట్ల కార్మికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. సమ్మె వల్ల రోజుకు 9 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా. కార్మిక సంఘాలు, యాజమాన్యం సమ్మె పరిష్కారానికి సిద్ధమేనని ప్రకటించినప్పటికీ ఎవరి షరతులు వారికున్నాయి.

బెల్లంపల్లి బొగ్గు గనులకు యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. కార్మికుల డిమాండ్లు అంగీకరిస్తే యాజమాన్యంపై 150 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని యాజమాన్యం అంటోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్చలకు ఆహ్వానించినా కార్మిక సంఘాల నేతలు రాలేదని, లాభపడాలనే ఉద్దేశంతోనే సమ్మె చేస్తున్నారని యాజమాన్యం వాదిస్తోంది. ఆపరేటర్లను నిర్బంధించి పని చేయించడం తమ ఉద్దేశం కాదని కూడా చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X