పనిలేకనే కాంగ్రెస్ ప్రాంతీయవాదంః బాబు
శ్రీకాకుళంః అధికారం లేప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గుర్తుకు వస్తుందని చంద్రబాబు నాయుడువిమర్శించారు. మహిళా శిశు జన్మభూమి కార్యక్రమం చివరి రోజు ఆదివారం నాడు ఆయనశ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనశ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ వారి హయాంలో ఏ ప్రాజెక్టులు వచ్చాయే తెల్చి చెప్పాలని ఆయన సవాలు చేశారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రాజెక్టుల పూర్తికోసం నిర్ణీత వ్యవధిని నిర్ణయించే ఆలోచన వున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ నిధులు వున్నా... వారిని మెప్పించి, ఓప్పించి రాష్ట్ర అభివృద్ధికి కేటాయిస్తున్నామని చంద్రబాబువివరించారు. కేవలం అధికార దాహంతో ప్రాంతీయ వాదాన్ని ప్రోత్సహిస్తూ అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన కాంగ్రెస్ నేతలకు హితవు చెప్పారు.
ఆ
తరువాత
ఆయన
ఒరిస్సా
సరిహద్దులోని
ఓ
కుగ్రామంలో
గ్రామసభను
నిర్వహించారు.
ఈ
సభకు
పరిసరగ్రామాలకు
చెందిన
మహిళలుపెద్ద
సంఖ్యలో
తరలి
వచ్చారు.
అధిక
సంతానంతో
జీవితాన్ని
దుర్భరం
చేసుకుంటున్న
ఓ
మహిళ
తన
బాధను
ముఖ్యమంత్రికి
చెప్పుకుంది.
అధిక
సంతానం
వల్ల
పడుతున్న
బాధలను
గుర్తించి,అందరి
ముందు
వాస్తవాన్ని
చెప్పుకున్న
ఆ
మహిళను
ముఖ్యమంత్రి
అభినందించారు.