వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జింబాంబ్వేపై భారత్‌ ఘనవిజయం

By Staff
|
Google Oneindia TeluguNews

బులవాయేః జింబాంబ్వేతో జరిగిన తొలిటెస్ట్‌ లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 184 పరుగులవిజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఆటు నాలుగో రోజునేవిజయానికి అవసరమైన పరుగులు సాధించింది. పరాయిగడ్డపై భారత్‌టెస్ట్‌ మ్యాచ్‌ లో విజయం సాధించడం 1986 తరువాత ఇదే ప్రధమం.

భారత్‌ ఆటగాళ్ళు సొంతగడ్డపైనే పులులని, ఇతరదేశాల పిచ్‌ లపై పిల్లులనేఅపవాదు ఈ విజయంతో తొలగిపోయింది. శనివారం 145 పరుగుల ఆధిక్యంతో వున్న జింబాంబ్వే మరో 40 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ ముగించింది. ఆ తరువాత భారత్‌ ఈ చిన్నవిజయలక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించింది. భారత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో ఓపెనర్‌ శివసుందర్‌ దాస్‌ అత్యధికంగా 82 పరుగులు చేశాడు. లక్ష్మణ్‌ మెరుపువేగంతో 35 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌ లో 5 ఫోర్లు, ఒకసిక్సర్‌ వున్నాయంటే అతని పరుగుల వేగం అర్థం చేసుకోవచ్చు.

మరో ఓపెనర్‌ రమేష్‌ 17 పరుగులకే అవుటయ్యాడు. లక్ష్మణ్‌ అవుటయ్యాక బరిలోకి దిగిన సచిన్‌ దూకుడుగా ఆడివిజయానికి అవసరమైన పరుగులు తేలికగా సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌ లో 74 పరుగులు చేసిన సచిన్‌ రెండో ఇన్నింగ్స్‌ లో 39 పరుగులు చేశాడు. భారత్‌ జింబాంబ్వే జట్ల మధ్య ఈ నెల 15 నుంచి హరారేలో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X