వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదర్శకుడు తిరుపతిస్వామి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః ప్రముఖ తెలుగుసినీ దర్శకుడు తిరుపతి స్వామి ఆదివారం తెల్లవారు జామున చెన్నయ్‌ లో జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు విద్యుత్‌ స్తంభానికి డీకొనడంతో తిరుపతిస్వామి అక్కడికక్కడే మరణించారు. కారుడ్రైవర్‌ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్‌ వున్నాడు.

వెంకటేష్‌ తో గణేశ్‌ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమలో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన తిరుపతి స్వామి తొలిచిత్రంతోనే మంచిపేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత నాగార్జునతో ఆజాద్‌ చిత్రాన్ని నిర్మించి విలక్షణమైన దర్శకుడిగా పేరుపడ్డారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ తమిళ హీరో విజయకాంత్‌ తో ఆయన సొంతబ్యానర్‌ పై సెల్యూట్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా రీ రికార్డింగ్‌ పనులు పూర్తి చేసుకొని తెల్లవారు జామున ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

తిరుపతి స్వామి మృతికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X