వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలిసుందాం..ప్రగతిసాధిద్దాం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర విభజన ఏ మాత్రం పరిష్కారం కాదని ఆరు వామపక్ష పార్టీలు ఆదివారం స్పష్టం చేశాయి. వెనుకబడిన తెలంగాణా ప్రాంతం అభివృద్ధికి ఐదు వేల కోట్లు రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల్సిందిగా ఆదివారం జరిగిన వామపక్ష పార్టీల సదస్సు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

ఇంతకాలంగా తెలుగుదేశం ప్రభుత్వంలో వున్న చంద్రశేఖర రావుకు ఇప్పుడు తెలంగాణాపై ప్రేమపుట్టుకురావడం కేవలం అధికారం కోసమేనని సభలో ప్రసంగించిన సిపిఎం నేత బి.వి. రాఘవులువిమర్శించారు. తెలంగాణా రాష్ట్ర సమితికి గానీ, కాంగ్రెస్‌ పార్టీకి కానీ నిజంగా ఆంధ్ర రాష్ట్రం పై అభిమానం వుంటే తెలంగాణాకు 5వేల కోట్లు రూపాయల ప్రత్యేక ప్యాకేజి సాధించేందుకు వామపక్షాలతో చేతులు కలపాలని హితవు చెప్పారు.

గత రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణాలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు..... అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారనేఅంశంపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా సిపిఐ నేత సురవరం సుధాకర్‌ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ఆయనకోరారు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌ తోనే రాష్ట్రసర్వతో ముఖాభివృద్ధి సాధ్యపడుతుందని ఆరు వామపక్షాలు ఈ సదస్సులో స్పష్టం చేశాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X