వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెత్తురోడినశ్రీకాకుళం జన్మభూమి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళంః శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సుపేట మండలం సునీతాపురంలో జన్మభూమి కార్యక్రమం ఆదివారం రక్తసిక్తమైంది. పాతకక్షల కారణంగా జన్మభూమి గ్రామసభలో ఒకవర్గం వారు మరో వర్గం పై దాడి చేయడంతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు కూడా వున్నారు. పాతకక్షలే ఈ ఘర్షణలకు కారణంగా భావిస్తున్నారు. అయితే పవిత్ర ఆశయంతో ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమంలో పాతకక్షలు పడగవిప్పడంఅందరినీ ఆశ్చర్యపరచింది.

గాయపడిన 12 మంది ప్రస్తుతం శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జన్మభూమి కార్యక్రమం ప్రారంభం కాగానే నోడల్‌ అధికారులకు ప్రజలు తమ సమస్యలు వివరిస్తుండగా ప్రత్యర్థి వర్గం వారు తమపై కత్తులతో దాడి చేశారని సునీతా పురం సర్పంచ్‌ వర్గానికి చెందిన ఓ బాధితుడు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X