బిజినెస్ వీక్టాప్ 100లో విప్రో
న్యూయార్క్: ప్రపంచంలోని 100 అగ్రశ్రేణి ఐటి కంపెనీల్లో భారత్కు చెందిన విప్రో టెక్నాలజీస్ చోటు సంపాదించింది. అంతర్జాతీయ వాణిజ్య పత్రిక బిజినెస్ వీక్ వరుసగా నాలుగో ఏడాది ప్రచురించిన జాబితాలో దక్షిణాసియా నుంచి ఈ సారి కేవలం విప్రో మాత్రమే స్థానం సంపాదించగలిగింది.
తమ విలేకరుల నుంచి స్టాండర్డ్ అండ్ పూర్ సంస్థ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా శరవేగంతో ఎదుగుతున్న కంపెనీలు, అత్యధికంగా లాభాలు గడిస్తున్న కంపెనీల జాబితాను బిజినెస్ వీక్ తయారు చేసింది. ఈజాబితాలో ప్రవాస భారతీయుల కంపెనీలు జునిపర్ నెట్వర్క్స్, సిరస్ లాజిక్ వున్నాయి.
అయితే ప్రవాస భారతీయుల ఐటి కంపెనీల్లో ప్రముఖంగా వెలిగే ఎక్సోడస్, ఐ2టెక్నాలజీస్కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. మొత్తం 100 కంపెనీల జాబితాలో కేవలం 30 మాత్రమే అమెరికాయేతర ఐటి కంపెనీలు వున్నాయి. విప్రో ఈ జాబితాలో 87వ స్థానంలో వుంది. కాగా మరో అగ్రశ్రేణి భారతీయ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్కు ఈ జాబితాలో చోటు లభించలేదు. బిజినెస్ వీక్ లెక్కల ప్రకారం ఇన్ఫోసిస్ 102వ స్థానంలో వుంది. టాప్ 200లో ఇన్ఫోసిస్తో పాటు విఎస్ఎన్ఎల్ కూడా చోటుసంపాదించుకున్నది.
-
ఇ-కామర్స్దే
భవిష్యత్తు