ఇ-కామర్స్దేభవిష్యత్తు
ముంబాయి:ఇ-కామర్స్వ్యాప్తికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకుప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రంగంలో వున్నఅపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలంటేప్రభుత్వం ఇ-కామర్స్ను సామాజిక అవసరంగా ప్రమోట్చేయాలని సిఐఐ సూచించింది.
డిజిటల్డివైడ్ను అధిగమించడానికి ఇ-కామర్స్ మౌలికవసతులనుప్రభుత్వం విస్తృతంగా అభివృద్ధి చేయాలనిసిఐఐ ఇ-కామర్స్పై నియమించిన బృందం ప్రత్యేకనివేదికలో అభిప్రాయపడింది. అమెరికాకు చెందినఎకనామిస్ట్ ఇంటలీజెన్స్ యూనిట్ ఈ మధ్య ప్రకటించినఒక నివేదికలో ఇ-కామర్స్ అనుకూల దేశాల్లోభారత్కు 45వ స్థానాన్ని ఇచ్చింది. అమెరికా సంస్థమదింపు నేపథ్యంలో సిఐఐ నివేదికకు అత్యంతప్రాధాన్యత ఏర్పడింది.
ఇ-కామర్స్లోభారత్ శరవేగంతో అభివృద్ధి చెందే అవకాశంవున్నప్పటికీ ఈ విషయంలో టెక్నాలజీ ప్రధానఅవరోధంగా మారే సూచనలు వున్నాయని సిఐఐనివేదిక హెచ్చరించింది. ఈ నివేదికనుకేంద్ర ఐటి మంత్రి ప్రమోద్ మహాజన్ ఈనెల 13న ముంబాయిలో విడుదల చేస్తున్నారు.
ఇ-కామర్స్ ఇన్ఇండియా: హౌటు మేక్ ఇట్ హపెన్ పేరుతోరూపొందించిన ఈ నివేదికలో, ఇ-కామర్స్ అభివృద్ధికిచేపట్టాల్సిన విధానాలపై అనేక సూచనలువున్నాయి.
భారతీయవాణిజ్య, పారిశ్రామిక సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లనుసులభంగా అందుకోవడానికి ఇ-కామర్స్ను మించినమార్గం లేదని సిఐఐ అభిప్రాయపడింది.
కమ్యూనికేషన్వసతులు,చెల్లింపులు-పన్నులు, ఆన్లైన్లావాదేవీల భద్రత, ఇ-గవర్నన్స్ వంటిఅంశాలపై ప్రభుత్వం, పారిశ్రామిక రంగం దృష్టి నిలపాల్సినఅవసరంవున్నదని సిఐఐ పేర్కొంది.
-
బిజినెస్
వీక్
టాప్
100లో
విప్రో