అక్టోబర్లో బలహీనవర్గాల జన్మభూమి
హైదరాబాద్ : అక్టోబర్ నెలలో బలహీన వర్గాలపై ప్రత్యేక జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. నిన్నటితో ముగిసిన మహిళా శిశు జన్మభూమి నూటికి నూరు శాతం విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. మహిళా శిశు జన్మభూమికి ప్రజలలో మంచి స్పందన లభించిందని ఆయన అన్నారు.
నీరు-మీరు, మహిళా శిశు సంరక్షణపై ప్రజలలో సరైన అవగాహన కల్పించటంలో జన్మభూమి కార్యక్రమం విజయం సాధించిందని ఆయన అన్నారు. గత ఐదు సంవత్సరాలలో అతి తక్కువగా ఈ జన్మభూమి కార్యక్రమంలోనే గ్రామ సభల బహిష్కరణ జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. జన్మభూమిలో కొన్ని గ్రామాలలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించటం జరిగిందని, ఈ కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాపితంగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతామని ఆయన అన్నారు.
జన్మభూమిపై
విశాఖపట్నం,
ఒంగోలు,
తిరుపతిలో
సమీక్షా
సమావేశాలు
నిర్వహిస్తున్నామని
చంద్రబాబు
తెలిపారు.
ఇప్పటి
వరకూ
జరిగిన
జన్మభూమి
కార్యక్రమాలను
సమీక్షించుకుని
అక్టోబర్లో
బలహీనవర్గాలపై
ప్రత్యేకంగా
జరిగే
జన్మభూమి
కూడా
విజయవంతం
చేస్తామని
ఆయన
పేర్కొన్నారు.స్థానిక
సంస్థలకు
అధికారాల
బదలాయింపుపై
ఒకటి
రెండు
రోజుల్లో
రాష్ట్ర
మంత్రి
వర్గం
తగిన
నిర్ణయాలు
తీసుకునే
అవకాశం
వున్నదని
ముఖ్యమంత్రి
చెప్పారు.