వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలుగుదేశం కక్షసాధింపు
హైదరాబాద్: సింగరేణి సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావు తెలిపారు. సింగరేణిలో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం అనుబంధ సంఘం ఓడిపోవటంతో ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల పట్ల కక్ష సాధింపుకు పూనుకుంటున్నారనిఆయన ఆరోపించారు.
సింగరేణి కార్మికుల డిమాండ్ పూర్తిగా న్యాయబద్దమైనదని ఆయన చెప్పారు. గతంలో కుదిరిన వేతన ఒప్పందంలోని అంశాలనే అమలుచేయమని వారు కోరుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణా ప్రాంతంలో వున్నవే అతితక్కువ పరిశ్రమలని వాటిపై తెలుగుదేశం పార్టీ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆయన ఆరోపించారు. తెలంగాణా ప్రాంతంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్డినన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు మద్దతునిస్తున్నారని ఆయన విమర్శించారు.
Comments
Story first published: Monday, June 11, 2001, 23:53 [IST]