వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పంచాయతీపై తెలుగుదేశం కసరత్తు
హైదరాబాద్ః రానున్న పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సోమవారం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారధ్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టుఅంశం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ, తెలంగాణా ఉద్యమానికి విరుగుడుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేఅంశంపైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఆదివారంతో ముగిసిన మహిళా, శిశు జన్మభూమి గురించి కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో సమీక్షించారు.
Story first published: Monday, June 11, 2001, 23:53 [IST]