అనంత రైతు ఆందోళన తీవ్రం
అనంతపురం: మేలు రకం వేరు శెనగ విత్తనాలకోసం అనంతపురం రైతులు చేస్తున్న ఆందోళన గురువారం నాటికి రెండవ రోజుకు చేరుకుని మరింత తీవ్ర రూపం దాల్చింది. గురువారం నాడు రైతులు అనంతపురంలో వ్యవసాయ శాఖ కమీషనర్, జిల్లా జాయింట్ కలెక్టర్లను దిగ్భంధించారు.
సాయంత్రం 7 గంటల సమయానికి కూడా దిగ్భంధం కొనసాగుతూవుంది. తమకు ప్రభుత్వం నాసిరకం విత్తనాలను సరఫరా చేస్తున్నది ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. కాగా, రైతులులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల విత్తనాలు మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించటంతో రైతులు మరింత రెచ్చిపోయారు. రైతుల ఆందోళనకు సిఎల్పీ ఉప నాయకుడు జె.సి.దివాకర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. వివిధ వామపక్ష పార్టీలు కూడా రైతుల ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు.
కాగా,
గురువారం
నాడు
రైతుల
ఆందోళన
జిల్లా
కంతటికీ
పాకింది.
మడకశిర,
తాడిపర్తి,
తదితర
ప్రాంతాలలో
కూడా
రైతులు
ఆందోళనకు
దిగారు.
వివిధ
రూపాయలలో
రైతులు
తమ
నిరసనను
తెలియజేస్తున్నారు.
ఎప్పడూ
కరువు
విలయతాండవం
చేసే
అనంతపురం
జిల్లాలో
కేవలం
వేరుశెనగ
పంట
మాత్రమే
బాగా
పండే
అవకాశముంది.
ఈ
వేరుశెనగ
విత్తనాలకే
నాసిరకమివి
కావటంతో
రైతులు
దిక్కుతోచని
స్ధితిలో
ఆందోళనకు
పూనుకున్నారు.