వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల బరిలో డ్వాక్రా మహిళలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: డ్వాక్రా మహిళలను ఎన్నికల బరలోకి దిగాల్సిందింగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గురువారం నాడు నిజామాబాద్‌, హైదరాబాద్‌లో జరిగిన డ్వాక్రా మహిళల చైతన్య సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

అనతికాలంలోనే 1000 కోట్ల రూపాయలను పొదుపు చేసిన డ్వాక్రా మహిళలు బృహత్‌ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నారని ఆయన అన్నారు. మునుముందు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుఇచ్చే స్థాయికి డ్వాక్రా గ్రూప్‌లు ఎదుగవచ్చని ఆయన చమత్కరించారు. డ్వాక్రా గ్రూప్‌ల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

డ్వాక్రా మహిళలకోసం మరో 15 లక్షల గ్యాస్‌ కనెక్షన్లను విడుదల చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయంపై శుక్రవారం నాడు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టుగా ఆయన వెల్లడించారు. డ్వాక్రా గ్రూప్‌ల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలనే విషయంలో తాము సీరియస్‌గా వున్నామని ఆయన తెలిపారు. మరో ఏడాది రెండేళ్ల కాలంలో ప్రతిగ్రామానికి
ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌లో డ్వాక్రా మహిళలకు శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు. నిజామాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలకు చెందిన డ్వాక్రా గ్రూప్‌లు పాల్గొనగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ ప్రాంతాలకు చెందిన డ్వాక్రా గ్రూప్‌లు పాల్గొన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X