వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిటాల ఇంటిముందు ఎక్ఛేంజ్ దగ్ధం
హైదరాబాద్ : మాజీ మంత్రి, ప్రస్తుత తెలుగుదేశం ఎమ్మల్యే పరిటాల రవి స్వగ్రామంలో ఆయన ఇంటిముందున్న టెలిఫోన్ ఎక్ఛేజ్ను దగ్ధం చేసి పీపుల్స్వార్ నక్సలైట్లు సంచలనం సృష్టించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు ఉండే అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పరిటాల స్వగ్రామమైన వెంకటాపురంలో బుధవారం రాత్రి పీపుల్స్నక్సలైట్లు దగ్ధం చేయటం తీవ్ర సంచలనం కలిగించింది.
ఈ సంఘటనలో 15 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. పరిటాల రవి చాలా సంవత్సరాలనుంచీ పీపుల్స్వార్ హిట్లిస్ట్లో వున్నారు. దీంతో ఈ సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ సంఘటన దరిమిలా రవి ఆయనతో పాటు జిల్లాలో నక్సల్స్ హిట్లిస్ట్లో వున్న వారికి భద్రతను మరింత పెంచనున్నట్టుగా అనంతపురం జిల్లా ఎస్పి అంజనాసిన్హా తెలిపారు
Comments
Story first published: Thursday, June 14, 2001, 23:53 [IST]